ఖమ్మం జిల్లా మధిర మండలం సమీపంలో తిరువూరు నుండి మధిర కోడిగుడ్ల లోడుతో వెళుతున్న మినీ వ్యాన్ వేగంగా ములుపు తిరగడంతో అదుపుతప్పింది. వ్యాన్ బోల్తా పడడంతో దానిలో ఉన్న కోడిగుడ్లు మొత్తం పగిలిపోయాయి. దీంతో సుమారు 2 లక్షలు నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై మధిర రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.