Eatala Rajender: ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్‌కు ప్రజలు గుర్తుకువస్తారు..

Eatala Rajender: ఎన్నికలు వచ్చినప్పుడే సీఎం కేసీఆర్‌కు ప్రజలు గుర్తుకువస్తారని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌.

Update: 2022-08-20 13:49 GMT

Eatala Rajender: ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్‌కు ప్రజలు గుర్తుకువస్తారు.. 

Eatala Rajender: ఎన్నికలు వచ్చినప్పుడే సీఎం కేసీఆర్‌కు ప్రజలు గుర్తుకువస్తారని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌. కేసీఆర్‌ చెప్పే చిల్లర మాటలను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు.. ప్రజలను మెప్పించే శక్తిని కేసీఆర్‌ కోల్పోయారు. కేసీఆర్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవనివ్వం. కేసీఆర్‌ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు. కేసీఆర్‌ మాటలకు రేపటి సభలో తప్పకుండా సమాధానం చెబుతాము. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న పార్టీ అని డబ్బు, మద్యాన్ని నమ్ముకున్న పార్టీ కాదని అన్నారు. దేశవ్యాప్తంగా రోజు రోజుకు కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పడిపోతోందని, ప్రజల విశ్వాసాన్ని కాంగ్రెస్‌ కోల్పోయిందని ఆరోపించారు. మునుగోడు ఉపఎన్నిక ప్రజాస్వామ్యానికి, అప్రజాస్వామ్యానికి మధ్య జరుగుతోందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.

Tags:    

Similar News