డాక్టర్ల నిర్లక్ష్యం.. డెలివరీ సమయంలో శిశువు తల కోసేసిన వైద్యులు

Update: 2019-12-20 08:45 GMT

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వాస్పత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. డెలివరీ సమయంలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ చిన్నారి ప్రాణం గాల్లో కలిసింది. నడింపల్లి గ్రామానికి చెందిన స్వాతి డెలివరీ కోసం ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. ప్రసవ సమయంలో డాక్టర్లు శిశువు మొండెం నుంచి తలను వేరుచేశారని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. గర్భిణి స్వాతి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆగ్రహించిన గర్భిణి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. డెలివరీ సమయంలో నిర్లక్ష్యం వహించిన డాక్టర్లు, వైద్య సిబ్బందిపై దాడికి ప్రయత్నించారు. అడ్డుకున్న ఓ కానిస్టేబుల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. 

Tags:    

Similar News