దిశ కేసు నిందితుని ఇంట్లో మరో విషాదం
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యకేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసి హతమార్చిన విషయం తెలిసిందే.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యకేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసి హతమార్చిన విషయం తెలిసిందే. దాంతో వారి కుటుంబాలన్నీ విషాదంలో మునిగిపోయాయి. ఆ బాధనుంచి బయటికి రాకముందే నిందితుల్లో ఒకరైన చెన్నవేశవులు కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకెళితే నారాయణ్ పేట్ జిల్లా మక్తల్ మండలం జక్లేర్ గ్రామంలో చెన్నకేశవ తండ్రి రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. బైక్పై వెళ్తున్న కురుమయ్యను ఇన్నోవా వాహనం అతి వేగంగా ఢీకొట్టింది. గురువారం వ్యక్తిగత పని నిమిత్తం బైక్పై జక్లేర్కు వెళ్లిన కురుమయ్య తిరిగి గుడిగుండ్లకు తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
అది గమనించిన స్థానికులు తీవ్రగాయాలపాలైన ఆయన్ని హుటాహుటిన మక్తల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో అక్కడి వైద్యులు కురుమయ్యకు ప్రథమ చికిత్స అందించారు. అక్కడ అతని పరిస్థితి విషమించడంతో ఆయన్ని మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించారు. ఈ ప్రమాదంలో కురుమయ్య కుడికాలు విరిగిపోయిందని వైద్యుల వెల్లడించారు. ఈ సంఘటనపై స్ధానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు వెంటనే ఆస్పత్రికి వెళ్లి ఈ ఘటనపై వివరాలు సేకరించారు.