Darshanam Mogilaiah: పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగిలయ్య ఇంట్లో తీవ్ర విషాదం

Darshanam Mogilaiah: కిన్నెర వాయిద్యకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగిలయ్య కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Update: 2022-05-05 12:16 GMT

Darshanam Mogilaiah: పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగిలయ్య ఇంట్లో తీవ్ర విషాదం

Darshanam Mogilaiah: కిన్నెర వాయిద్యకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగిలయ్య కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కూతురు బుద్దుల రాములమ్మ(38) బుధవారం మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మొగిలయ్య రెండో కూతురు రాములమ్మ వివాహం 20 ఏళ్ల క్రితం నాగర్ కర్నూల్ మండలం లింగసానిపల్లి గ్రామానికి చెందిన వెంకటస్వామితో జరిపించారు. వివాహం జరిగిన నాలుగేళ్ల తర్వాత భర్త మృతిచెందాడు. అప్పటి నుంచి రాములమ్మ తండ్రి దగ్గరే ఉంటోంది.

మంగళవారం గ్రామంలో వృద్ధురాలు చనిపోతే ఆమె ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా రాత్రి ఇంటి ఎదురుగా ఉన్న బీటీ రోడ్డుపై జారి పడింది. తలకు తీవ్ర గాయాలవడంతో పరిస్థితి విషమంగా ఉండటంతో అచ్చంపేట హాస్పిటల్‌కు రెఫర్ చేశారు. రాత్రి పది గంటల ప్రాంతంలో అచ్చంపేట ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. గ్రామంలోనే రాములమ్మ అంత్యక్రియలు నిర్వహించారు. 

Tags:    

Similar News