Coronavirus updates in Telangana: తెలంగాణ‌లో కొత్త‌గా 1,610 కరోనా పాజిటివ్ కేసులు

Update: 2020-07-28 04:59 GMT
Corona updates in Telangana

Coronavirus updates in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,610 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 57,142కి చేరింది. మృతుల సంఖ్య 480కి పెరిగింది. కరోనా నుంచి తాజాగా 803 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన వారి సంఖ్య 42,909కి చేరింది. ప్రస్తుతం 13,753 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.84 శాతమని అధికారులు తెలిపారు. నిన్న ఒక్కరోజే 15,839మంది నమూనాలను పరీక్షించగా, 1,610 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. రాష్ర్టంలో ఇప్ప‌టి వ‌ర‌కు 3,79,081 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.

నిన్న రాత్రి 8 గంటల వరకు జిల్లాల వారీగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్ని గమనిస్తే... GHMC పరిధిలో 531 కేసులు వచ్చాయి. ఆదిలాబాద్ జిల్లాలో 13, భద్రాద్రి కొత్తగూడెం 16, జగిత్యాల 12, జనగాం 18, జయశంకర్ భూపాలపల్లి 20, గద్వాల్ 34, కామారెడ్డి 18, కరీంనగర్ జిల్లాలో 48 కేసులు వచ్చాయని తెలిపింది. అలాగే ఖమ్మంలో 26, అసిఫాబాద్ 0, మహబూబ్ నగర్ 23, మహబూబాబాద్ 14, మంచిర్యాల 13, మెదక్ 12, మేడ్చల్ మల్కాజిగిరి 113, ములుగు 32, నాగర్ కర్నూల్ 9, నల్గొండ 26, నారాయణపేట్ 14, నిర్మల్ 0 కేసులొచ్చాయి. నిజామాబాద్ 58, పెద్దపల్లి 48, సిరిసిల్ల 14, రంగారెడ్డి 172, సంగారెడ్డి 74, సిద్దిపేట 14, సూర్యాపేట 35, వికారాబాద్ 11, వరంగల్ రూరల్ 25, వరంగల్ అర్బన్ 152, యాదాద్రి భువనగిరి 12 కేసులొచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న జనరల్ బెడ్లు 11928 అని చెప్పిన ప్రభుత్వం, నిండి ఉన్న జనరల్ బెడ్లు 587గా తేల్చింది. అలాగే ఆక్సిజన్ బెడ్లు 3537 ఖాళీగా ఉండగా 1383 నిండి ఉన్నట్లు తెలిపింది. ICU బెడ్లలో 1616 ఖాళీగా ఉండగా... 272 నిండి ఉన్నాయి.



 



Tags:    

Similar News