వెంకటాపురం (వాజేడు): మండల వ్యాప్తంగా మొక్కజొన్న, మిర్చి పంటలను పండించిన రైతులు కరోనా వైరస్ మహమ్మారి వలన తాము పండించిన పంటలను అమ్ముకోలేక పోతున్నామని ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రభుత్వం లాక్ డౌన్ నిర్వహించడం ద్వారా మార్కెట్లోకి పంటలను తీసుకెళ్ళి అమ్ముకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.