Telangana: తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్‌.. బీజేపీలోకి మాజీ ఎంపీ..

Telangana: తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్‌ తగిలింది.

Update: 2021-03-15 10:27 GMT

ఫైల్ ఇమేజ్ 

Telangana: తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్‌ తగిలింది. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి బీజేపీలో చేరనున్నారు. ఇవాళో రేపో కషాయ కండువా కప్పుకోవడానికి రెడీ అయ్యారు. పార్టీ మారుతున్న విషయాన్ని తన అనుచరులకు కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి సమాచారం ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిన్నారెడ్డికి నష్టం జరగకుండా ఉండాలనే ఇంతకాలం పార్టీ మారలేదని ఎన్నికల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొండా స్పష్టం చేశారు.

Tags:    

Similar News