Jagga Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉంటుంది

Jagga Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి.

Update: 2024-04-05 13:45 GMT

Jagga Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉంటుంది

Jagga Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి. జూన్ తర్వాత కావాల్సినన్ని నిధులు తీసుకొచ్చి.. సంగారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానన్నారు. ఆసుపత్రుల్లో సౌకర్యాలు కల్పిస్తానన్నారు. అలాగే సదాశివపేట మండలం సిద్దపూర్, కొండాపూర్ మండలం అలియాబాద్‌లో ఇళ్ళ పట్టాలు పొందిన వారందరికీ పొజిషన్ ఇస్తామని జగ్గారెడ్డి హామీ ఇచ్చారు. ఇళ్ళ పట్టాల పొజిషన్ కోసం ఇప్పటికే రెవెన్యూ మంత్రి పొంగులేటిని కలిశానన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకి సంగారెడ్డి నియోజకవర్గంలో 20వేల మెజారిటీ రావాలన్నారు జగ్గారెడ్డి.

Tags:    

Similar News