12న డిపోల వద్ద ఆర్టీసీ జేఏసీతో కాంగ్రెస్‌ దీక్ష :భట్టి విక్రమార్క

-ఆర్టీసీ కార్యక్రమాలలో విస్తృతంగా పాల్గొనాలన్న సీఎల్సీ నేత -11న టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు -భట్టి విక్రమార్క -12న డిపోల వద్ద ఆర్టీసీ జేఏసీతో కాంగ్రెస్‌ దీక్ష -భట్టి విక్రమార్క

Update: 2019-11-10 13:08 GMT
Bhatti Vikramarka

 ఆర్టీసీ కార్యక్రమాలలో విస్తృతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఆర్టీసీ జేఏసీ, కాంగ్రెస్ కోర్‌ కమిటీ సమావేశాలలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11వ తేదీన కాంగ్రెస్ కార్యకర్తలు ఆర్టీసీ కార్యకర్తలతో కలిసి టీఆర్ఎస్ ఎమ్యెల్యే, ఎంపీ, మంత్రులు, ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు ధర్నాలు చేయాలని, ఆర్టీసీ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేయాలని నిర్ణయించినట్టు భట్టి తెలిపారు. ఈనెల 12న ఆర్టీసీ డిపోల వద్ద కార్మికుల దీక్షలో పాల్గొంటామని, 18న సడక్‌ బంద్‌, వంటావార్పు చేపట్టనున్నట్టు తెలిపారు.

Tags:    

Similar News