Revanth Reddy: బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖలపై సీఎం రేవంత్ సమీక్ష

Revanth Reddy: సంక్షేమ హాస్టళ్లకు గ్రీన్‌ ఛానెల్‌ ద్వారా నిధులు విడుదల ప్రణాళికలు

Update: 2024-01-27 12:25 GMT

Revanth Reddy: బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖలపై సీఎం రేవంత్ సమీక్ష 

Revanth Reddy: బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖలపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి. .. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లబ్ధిదారులకు నగదుతో పాటు తులం బంగారం ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో బీసీ స్టడీ సర్కిల్‌ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని సీఎం సూచించారు.

సంక్షేమ హాస్టళ్లకు గ్రీన్‌ ఛానెల్‌ ద్వారా నిధులు విడుదల చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు రేవంత్ రెడ్డి. గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించేందుకు స్థలాలు గుర్తించి, అంచనాలు తయారు చేయాలన్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్‌, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ సమీక్షలో పాల్గొన్నారు.

Tags:    

Similar News