ఇవాళ సచివాయంలో సీఎం రేవంత్ సమీక్ష
Revanth Reddy: రాష్ట్రంలో తాగునీటి అవసరాలపై అధికారులతో రివ్యూ
Revanth Reddy: తెలంగాణ సచివాలయంలో ఇవాళ సీఎం రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో తాగునీటి అవసరాలపై అధికారులతో సమీక్ష చేపట్టనున్నారు. ఎండాకాలంలో ప్రజలకు నీటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. మరో వైపు ఎండలు తీవ్రంగా ఉండబోతున్నాయనే వాతావరణశాఖ హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ వర్గాలు సూచిస్తున్నాయి.