Revanth Reddy: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ ఏరియల్ సర్వే
Revanth Reddy: మొంథా తుపాను (Montha Cyclone) కారణంగా భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈరోజు పర్యటించారు.
Revanth Reddy: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ ఏరియల్ సర్వే
Revanth Reddy: మొంథా తుపాను (Montha Cyclone) కారణంగా భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈరోజు పర్యటించారు. లక్షలాది ఎకరాల పంటలు నీటమునగడం, వేలాది ఇళ్లు దెబ్బతినడంతో నష్టపోయిన బాధితులను ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు.
సీఎం రేవంత్రెడ్డి ముందుగా మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి హెలికాప్టర్ ద్వారా హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. తుపాను నష్టం తీవ్రతను గమనించారు.
అనంతరం, హనుమకొండ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన స్వయంగా పర్యటించారు. సమ్మయ్యనగర్ ప్రాంతంలో నీటమునిగిన కాలనీలను, దెబ్బతిన్న నాలాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా సర్వం కోల్పోయిన బాధితులను సీఎం రేవంత్రెడ్డి నేరుగా పరామర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
సీఎం వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ సహా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.