ఇవాళ హైదరాబాద్‌కు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి

Hyderabad: యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలకనున్న సీఎం కేసీఆర్

Update: 2022-07-02 02:32 GMT

ఇవాళ హైదరాబాద్‌కు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి

Hyderabad: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఇవాళ హైదరాబాద్‌కు రానున్నారు. బేగంపేట్ ఎయిర్‌ పోర్టులో యశ్వంత్ సిన్హాకు సీఎం కేసీఆర్ స్వాగతం పలకనున్నారు. యశ్వంత్ సిన్హాకు మద్ధతుగా 10వేల మందితో టీఆర్ఎస్‌ భారీ బైక్ ర్యాలీ చేపట్టనుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు జలవిహార్‌లో యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వానికి మద్ధుతుగా జరిగే సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు.

ఇక మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో కలిసి లంచ్ చేయనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఐటీసీ కాకతీయలో ఎంఐఎం ఎంపీ, ఎమ్మెల్యేలతో భేటీకానున్నారు. సాయంత్రం 4.45 గంటలకు యశ్వంత్ సిన్హా బెంగళూరు వెళ్లనున్నారు.

Tags:    

Similar News