తెలంగాణ‌ భవన్‌ లో పార్టీ జెండాను ఎగురవేసిన సీఎం కేసీఆర్

Update: 2020-04-27 04:15 GMT

తెలంగాణ రాష్ట్రసమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్‌లో‌ పార్టీ జెండాను ఎగురవేశారు. మొదట తెలంగాణ భవన్‌లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ప్రొ. జయశంకర్‌  విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేసీఆర్‌తో పాటు పార్టీ ముఖ్య నేతలు పార్టీ ఆవిర్భావ వేడుకలకు హాజరైయ్యారు. తెలంగాణ రాష్ట్ర సమితి 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, టీఆర్‌ఎస్‌ శ్రేణులకు పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

Tags:    

Similar News