ముత్యంరెడ్డి మృతిపై కేసీఆర్, హరీశ్ రావు దిగ్ర్భాంతి
మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముత్యం రెడ్డి.. హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్సపొందారు. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి వైద్యులు శతవిధాలా ప్రయత్నం చేసినా విఫలం కావడంతో మృతి చెందారు.
మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముత్యం రెడ్డి.. హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్సపొందారు. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి వైద్యులు శతవిధాలా ప్రయత్నం చేసినా విఫలం కావడంతో మృతి చెందారు. ముత్యం రెడ్డి మృతిపట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థించారు. చెరుకు మత్యం రెడ్డి అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని కేసీఆర్.. సీఎస్ను ఆదేశించారు. ఇటు సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు సంతాపం తెలిపారు. మాజీ మంత్రి శ్రీ చెరుకు ముత్యంరెడ్డి గారి మరణం దురదృష్టకరం. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. మంత్రిగా, ఎమ్మేల్యేగా ప్రజలకు వారు చేసిన సేవలు గొప్పవి. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సానుభూతిని తెలుపుతున్నాను అని ట్వీట్ చేశారు.
మాజీ మంత్రి శ్రీ చెరుకు ముత్యంరెడ్డి గారి మరణం దురదృష్టకరం. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. మంత్రిగా, ఎమ్మేల్యేగా ప్రజలకు వారు చేసిన సేవలు గొప్పవి. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సానుభూతిని తెలుపుతున్నాను. pic.twitter.com/MyLh41VZqb
— Harish Rao Thanneeru (@trsharish) September 2, 2019