Telangana: 71వ గణతంత్ర వేడుకలు: అధికారులకు అవార్డులు
దేశ వ్యాప్తంగా ఆదివారం 71వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలు విభాగాల్లో ఉత్తమ సేవలందిస్తున్న అధికారులకు కేంద్ర హోం శాఖ అవార్డులను అందించింది.
దేశ వ్యాప్తంగా ఆదివారం 71వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలు విభాగాల్లో ఉత్తమ సేవలందిస్తున్న అధికారులకు కేంద్ర హోం శాఖ అవార్డులను అందించింది. ఈ మేరకు విజేతల జాబితాను శనివారం వెల్లడి చేసింది. ఈ పథకాలను అందుకున్న వారి జాబితాలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన అధికారులతో పాటుగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన అధికారులు కూడా ఉన్నారు. ఇక పోతే నలుగురు అధికారులను రాష్ట్రపతి పోలీస్ శౌర్యపతకం, 93 మందిని రాష్ట్రపతి పోలీస్ ఉత్తమ సేవా పతకానికి, 286 మందిని పోలీస్ శౌర్యపతకానికి, 657 మంది మెరిటోరియస్ సర్వీస్ అవార్డులను అందుకునే అర్హుల జాబితాలో చేర్చారు. కాగా ఈ జాబితాపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేసిన తరువాత వారి పేర్లను ప్రకటించారు.
ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ నుంచి అదనపు డీజీ శివధర్రెడ్డి రాష్ట్రపతి పోలీస్ శౌర్యపతాకానికి ఎంపికయ్యారు. ఎక్సైజ్శాఖ డైరెక్టర్గా పనిచేసి ఇటీవల డిప్యుటేషన్పై ఢిల్లీ వెళ్లిన అకున్సబర్వాల్ను మెరిటోరియస్ సర్వీస్ అవార్డుకు ఎంపికయ్యారు. వీరితో పాటు కొండాపూర్ 8వ బెటాలియన్ ఆర్ఎస్సై ఎస్ రవీంద్రనాథ్, హన్మకొండ ఏఎస్సై కే సుధాకర్, హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ అదనపు డీసీపీ ఇక్బాల్ సిద్ధిఖి, బాచుపల్లి అదనపు కమాండెంట్ పీ సత్యనారాయణ, టీఎస్ఎస్పీ రెండో బెటాలియన్ కమాండెంట్ ఆర్ వేణుగోపాల్, ఖమ్మం టౌన్ ఏసీపీ జీ వెంకటరావు, నిజామాబాద్ టాస్క్ఫోర్స్ ఏసీపీ డీ ప్రతాప్, గండిపేట ఏఎస్సై ఆర్ అంతిరెడ్డి, నల్లగొండ డీఎస్పీ ఎస్ జయరామ్, పోలీస్ అకాడమీ ఏఎస్సై ఎం నాగలక్ష్మి, పుప్పాల్గూడ సీనియర్ కమాండెంట్ డీ రమేశ్బాబు కూడా మెరిటోరియస్ సర్వీస్ అవార్డుకు ఎంపికయ్యారు. కాగా ఈ అవార్డులకు ఎంపికైన పోలీసు అధికారులను డీజీపీ ఎం మహేందర్రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.
ఇక ఇదే కోణంలో జైళ్లశాఖకు చెందిన ఐదుగురు అధికారులను కూడా మెరిటోరియస్ సర్వీస్ అవార్డుకు అర్హులుగా ఎంపిక చేసారు. ఈ అవార్డులను అందుకున్న వారిలో హైదరాబాద్ సెంట్రల్ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ సురకంటి శ్రీనివాస్రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా జైలు హెడ్వార్డర్ జీ లాలు, అగ్నిమాపక, విపత్తుల నిర్వహణశాఖలో జనగామ స్టేషన్ ఫైర్ఆఫీసర్ రాజ్కుమార్, కామటాల ఫైర్మెన్ భాస్కర్రావు ఫైర్ సర్వీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్కు ఎంపికయ్యారు.
హైదరాబాద్ చంచల్గూడ సెంట్రల్ జైలు హెడ్వార్డర్ ఈ సత్యనారాయణ, చీఫ్ హెడ్వార్డర్లు సత్తు పరుశరాములు, దోపటి ప్రతాప్, చెర్లపల్లి సెంట్రల్ జైల్ హెడ్వార్డర్ తోట చంద్రమౌలికి మెరిటోరియస్ సర్వీస్ విభాగంలో అవార్డులను అందుకున్నారు. ఇక ఇదే తరహాలో రైల్వే పోలీస్ సిబ్బందికి కూడా అవార్డులను అందించారు. వీరికి రెండు పథకాలను అందించారు. పోలీస్ మెడల్ ఫర్ గ్యాలెంటరీ, ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దక్షిణ మధ్య రైల్వే ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్లు టీ చంద్రశేఖర్రెడ్డి, మౌలాలి ట్రైనింగ్ సెంటర్ ఎస్సై డీ బాలసుబ్రహ్మణ్యం, కే చక్రవర్తి, పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీసెస్కు ఎంపికయ్యారు.