రామగుండం రైల్వే స్టేషన్‌లో ఇండోనేషియా దేశస్థులు.. సీసీ కెమెరాకు చిక్కిన దృశ్యాలు..

Update: 2020-03-19 11:47 GMT

ఈ నెల 14న రామగుండం రైల్వే స్టేషన్ కు వచ్చిన ఇండోనేషియా దేశస్థుల దృశ్యాలు సీసీ కెమెరాకు చిక్కాయి. రైల్వే స్టేషన్ లో దిగి నడుస్తూ బయటకు వచ్చి అద్దె వాహనం మాట్లాడుతున్నారు. హెచ్ ఎంటీవీకి ఈ దృశ్యాలు లభించాయి. కరీంనగర్‌లో ఇండోనేషియా దేశస్థులు తిరిగిన ప్రాంతాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. తెలంగాణలో ఇండోనేసియన్లు తీవ్ర కలకలం రేపుతున్నారు. ఓ మత సంబంధ కార్యక్రమం కోసం వచ్చిన వీరంతా కరీంనగర్‌కు కరోనాను తీసుకొచ్చారు. మొత్తం 12 మంది ఇండోనేసియన్ల బృందంలో 8 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో వారంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా వచ్చారు? ఎవరెవరిని కలిశారు? అనే దానిపై అధికారులు ఆరాతీస్తున్నారు.  


Full View


Tags:    

Similar News