కాల్వలో పడిన స్కార్పియో వెలికితీత..కారులోనే ఆరు మృతదేహాల గుర్తింపు

Update: 2019-10-19 09:56 GMT

సూర్యపేట జిల్లా చాకిరాల దగ్గర నాగార్జున సాగర్ కాల్వలో బోల్తా పడిన స్కార్పియోను NDRF సిబ్బంది వెలికితీశారు. గల్లంతైన ఆరుగురు కారులోనే మృతి చెందినట్టు అధికారులు గుర్తించారు. క్రేన్ సాయంతో వాహనాన్ని బయటకు తీసిన సిబ్బంది లోపలున్న మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాదం జరిగిన వెంటనే కారు డోర్లు లాక్ అయినట్టు భావిస్తున్నారు. ఒకే సారి ఆరుగురు మృతి చెందడంతో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.   

Tags:    

Similar News