Revanth Reddy: కరెంట్ డిపాజిట్ల పేరుతో భారం మోపాలనుకోవడం రాక్షసత్వం
Revanth Reddy: సీఎం కేసీఆర్ ఆ ఆలోచనను విరమించుకోవాలి
Revanth Reddy: నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో ఇప్పటికే ప్రజలు అల్లాడిపోతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అన్నారు. తాజాగా కరెంట్ డిపాజిట్ల పేరుతో మరింత భారం మోపాలనుకోవడం రాక్షసత్వమని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. తక్షణం ఈ ఆలోచనను విరమించుకోవాలని లేదంటే కేసీఆర్ మరో బషీర్ బాగ్ పోరాటాన్ని చవి చూడాల్సి వస్తుందని రేవంత్ హెచ్చరించారు. విద్యుత్ వెలుగుల వెనక అవినీతి జలగలే తప్ప కేసీఆర్ ఘనత లేదన్నారు.