నాగార్జున పొలంలో డెడ్ బాడీ..

Update: 2019-09-19 03:37 GMT

టాలీవుడ్ హీరో నాగార్జునకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో మృతదేహం కలకలం రేపుతోంది. షాద్ నగర్ మండలంలోని పాపిరెడ్డి గూడలో నాగార్జునకు చెందిన 40 ఎకరాల పొలంలో మృతదేహం లభ్యమైంది. ఇటీవల పొలంలో నాగార్జున, అమల దంపతులు పర్యటించి చెట్లు నాటారు. ఆ పొలంలో సేంద్రియ పంటలు పండించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు నాగార్జున కుటుంబ సభ్యులు.

అయితే వ్యవసాయసాగుపై నిపుణులను పంపించారు. పొలంలోకి వెళ్లిన నిపుణులకు ఎక్కడినుంచో కుళ్లిపోయిన వాసన వస్తున్నట్టు గమనించారు. దాంతో ఒక గదిలో కుళ్లిపోయిన మృతదేహన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గదిని సీజ్‌ చేసిన పోలీసులు అక్కడే పోస్ట్ మార్టమ్ నిర్వహించాలని నిర్ణయించారు. చనిపోయిన వ్యక్తి ఎవరన్న దానిపైన దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా హత్యచేసి ఇక్కడ పడేశారా లేక సాధారణ మరణమేనా అన్న కోణంలో విచారిస్తున్నారు. 

Tags:    

Similar News