ఎలక్షన్ కమిషనర్‌ వెంటనే రాజీనామా చేయాలి : బండి సంజయ్‌

Update: 2020-12-04 06:12 GMT

హైకోర్టు తీర్పు.. అడ్డదారుల్లో గెలవాలని చూసిన టీఆర్ఎస్‌కు చెంపపెట్టు అన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవాలని చూసిన ప్రభుత్వం, ఎస్‌ఈసీ చేసిన ప్రయత్నాన్ని హైకోర్టు అడ్డుకుందన్నారు. ఎలక్షన్‌ కమిషనర్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

నగర ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పట్టారు-రాజాసింగ్

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్ ఫలితాలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిందన్నారు. ఇకపై కేసీఆర్‌, కేటీఆర్‌ మాయ మాటలను ప్రజలు నమ్మెస్థితిలో లేరన్నారు ఆయన. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్.

Tags:    

Similar News