రేపు ఢిల్లీకి బండి సంజయ్!

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ రేపు హస్తినకు బయలుదేరనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా లతో బండి సంజయ్ భేటీ కానున్నారు.

Update: 2020-12-05 09:52 GMT

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ రేపు హస్తినకు బయలుదేరనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా లతో బండి సంజయ్ భేటీ కానున్నారు. గ్రేటర్ ఎన్నికల ఫలితాల వివరాలను బీజేపీ జాతీయ నేతలకు వివరించనున్నారు. అలాగే హైదరాబాద్‎లో ప్రచారం నిర్వహించిన కేంద్రమంత్రులు ప్రకాష్ జవదేకర్, స్మృతీ ఇరానీ సహా పలువురిని కలిసి కృతజ్ఞతలు తెలపనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News