Bandi Sanjay: ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం.. ఎన్ని కుట్రలు చేసినా బీజేపీదే విజయం..

Bandi Sanjay: మునుగోడులో టీఆర్ఎస్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని బీజేపీ నేత బండి సంజయ్‌ ధ్వజమెత్తారు.

Update: 2022-11-03 13:59 GMT

Bandi Sanjay: ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం.. ఎన్ని కుట్రలు చేసినా బీజేపీదే విజయం..

Bandi Sanjay: మునుగోడులో టీఆర్ఎస్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని బీజేపీ నేత బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చెప్పిన మాట వినాలంటూ అధికారులు టీఆర్ఎస్‌ నేతలు బెదిరించారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికల ప్రక్రియను నాశనం చేశారు. ఎన్నికల కమిషనర్‌ సీఎం కేసీఆర్‌ జేబులో మనిషిగా మారిపోయారు. పోలింగ్‌ ప్రక్రియను సక్రమంగా నిర్వహించకుండా ఎన్నికల కమిషన్‌ కూడా తప్పు చేసిందని బండి సంజయ్‌ ఆరోపించారు.

ఎన్నికల అధికారుల పక్షపాత వైఖరిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ నాయకులు ఎన్ని ప్రలోభాలకు గురి చేసిన రాజగోపాల్ రెడ్డి అఖండ విజయం సాధించబోతున్నారని సంజయ్ చెప్పారు. రాజగోపాల్ రెడ్డి విజయంతో బీఆర్ఎస్, టీఆర్ఎస్ ఖేల్ ఖతం అని బండి సంజయ్ విమర్శించారు. ఓటు హక్కు వినియోగించుకుని ఇతరులకు ఆదర్శంగా నిలిచిన మునుగోడు యువతకు కృతజ్ఞతలు తెలిపారు.

Full View


Tags:    

Similar News