Bandi Sanjay: అప్పులున్నాయని తెలిసి ఆరు గ్యారెంటీలు ఎలా ఇచ్చారు..?
Bandi Sanjay: బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకం ఇది
Bandi Sanjay: అప్పులున్నాయని తెలిసి ఆరు గ్యారెంటీలు ఎలా ఇచ్చారు..?
Bandi Sanjay: కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను ఎలా అమలు చేస్తారో చెప్పాలని ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. అప్పు ఉందని చెప్పుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కాలం వెళ్లదిస్తోందని ఆయన విమర్శించారు. ఆరు గ్యారెంటీలను అమలు చేసే ప్లాన్ను వివరించి ప్రజలకు భరోసా ఇవ్వాలన్నారు. అప్పులు తీర్చేందుకు ప్లాన్ చేప్తే పెట్టుబడులు వస్తాయన్నారు. ఈటల రాజేందర్కు తనకు ఎలాంటి విభేదాలు లేవని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఈటల వెంట వచ్చిన వాళ్లు అందరూ పార్టీ వదిలి వెళ్లారు. కానీ ఈటల మాత్రం పార్టీనే నమ్ముకొని ఇక్కడే కొనసాగుతున్నారని బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీపై కుట్ర చేసేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్లు కలిసి నాటకం ఆడుతున్నాయని బండి సంజయ్ అన్నారు.