హైదరాబాద్‌ను యూటీగా మార్చే ప్రమాదం: అసదుద్దీన్‌ ఒవైసీ

* చెన్నై, బెంగళూరు, ముంబయి, అహ్మదాబాద్‌, లఖ్‌నవూలనూ యూటీలుగా మార్చేస్తారు

Update: 2021-02-14 07:35 GMT

file Image

మోదీ ప్రభుత్వం భవిష్యత్తులో హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే ప్రమాదం ఉందని అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. చెన్నై, బెంగళూరు, ముంబయి, అహ్మదాబాద్‌, లఖ్‌నవూలనూ యూటీలుగా మార్చేస్తారని తెలిపారు. ఇదే బీజేపీ విధానమని ఆరోపించారు. ఇప్పుడు కరతాళ ధ్వనులు చేసే సెక్యులర్‌ పార్టీలు ఆ ప్రాంతాలను యూటీలుగా మార్చినప్పుడు గగ్గోలు పెట్టడం ఖాయమన్నారు. ప్రభుత్వానికి మద్దతిచ్చే పార్టీలు అప్పటి పరిణామాలకు సిద్ధంగా ఉండాలని ఒవైసీ హెచ్చరించారు.

Full View


Tags:    

Similar News