ప్రారంభమైన ఆక్వా సదస్సు
మాదాపూర్ హెచ్ఐసీసీ ప్రాంగణంలో ఆక్వా అక్వేరియా ఇండియా-2019 ప్రదర్శన మొదలైంది. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మూడు రోజులు ఆక్వా అక్వేరియా ఇండియా-2019 ప్రదర్శన జరగనుంది.
మాదాపూర్ హెచ్ఐసీసీ ప్రాంగణంలో ఆక్వా అక్వేరియా ఇండియా-2019 ప్రదర్శన మొదలైంది. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మూడు రోజులు ఆక్వా అక్వేరియా ఇండియా-2019 ప్రదర్శన జరగనుంది. ఈ ప్రదర్శనను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. అయితే ఈ సదస్సులో భారత్ సహా ఆసియా దేశాల నుంచి ప్రముఖ మత్స్య, వ్యాపార, పరిశోధన సంస్థల ఆధ్వర్యంలో సుమారు 200 స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఏపీ మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ, తెరాస ఎంపీలు డాక్టర్ రంజిత్రెడ్డి, బండప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.