Secunderabad: డెక్కన్ మాల్ కూల్చివేతకు రంగం సిద్ధం
Secunderabad: భవనాన్ని కూల్చివేసేందుకు టెండర్ ఖరారు చేసిన జీహెచ్ఎంసీ
Secunderabad: సికింద్రాబాద్లో అగ్నిప్రమాదానికి గురైన డెక్కన్ మాల్ కూల్చివేతకు రంగం సిద్ధమైంది. భవనాన్ని కూల్చివేసేందుకు జీహెచ్ఎంసీ టెండర్ ఖరారు చేసింది. ఎస్కే మల్లు ఏజెన్సీకి టెండర్ ఫైనల్ చేశారు అధికారులు. 33 లక్షల 86 వేల టెండర్కు.. 38.14 శాతం లీజుతో ఎస్కే మల్లు ఏజెన్సీ టెండర్ తగ్గించుకుంది. సుమారు 22 లక్షల రూపాయలకు పని చేసేందుకు ఏజెన్సీ ముందుకు వచ్చింది.
ఇప్పటికే కూల్చివేతకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది ఎస్కే మల్లు ఏజెన్సీ. జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారుల క్లియరెన్స్ కోసం ఏజెన్సీ సిబ్బంది ఎదురుచూస్తున్నారు. డెక్కన్ మాల్కు బిల్డింగ్ కూల్చివేత యంత్రాలు చేరుకున్నాయి. దీంతో మధ్యాహ్నం నుంచి కూల్చివేత పనులు మొదలయ్యే అవకాశాలున్నాయి.