ఏయ్ నేను హైకోర్టు లాయర్ను… తాగిన మైకంలో పోలీసులతో యువకుడి వీరంగం
* బ్రీత్ అనలైజర్ టెస్ట్లో 94 పాయింట్లు రావడంతో కేసు నమోదు
ఏయ్ నేను హైకోర్టు లాయర్ను… తాగిన మైకంలో పోలీసులతో యువకుడి వీరంగం
Hyderabad: హైదరాబాద్ బంజారాహిల్స్లో మద్యం మత్తులో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. బ్రీత్ అనలైజర్ టెస్ట్లో 94 పాయింట్లు రావడంతో అతడిపై కేసు నమోదు చేశారు పోలీసులు. దీంతో రెచ్చిపోయిన యువకుడు.. తనకు హైకోర్టు జడ్జి తెలుసంటూ.. దుర్భాషలాడుతూ ట్రాఫిక్ ఎస్ఐని కాలితో తన్నాడు. ఈ ఘటనపై బంజారాహిల్స్ పీఎస్లో యువకుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు. యువకుడు ఆహా ఓటీటీలో విధులు నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.