ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ ఇంట విషాదం చోటు చేసుకుంది. శనివారం వేణుమాధవ్ సోదరుడు విక్రమ్బాబు (54) మృతి చెందారు. కాగా గత కొంతకాలంగా విక్రమ్బాబు అనారోగ్యంతో బాధపడుతున్నారు. స్థిరాస్తి వ్యాపారి, పలు చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించిన ఆయనకు శుక్రవారం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఈసీఐఎల్లోని ఓ ప్రైవేట్ ఆసుప్రతిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతిచెందినట్లు ఆయన సోదరుడు వేణుమాధవ్ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు హెచ్బీ కాలనీలోని ఆయన నివాసానికి వెళ్లి నివాళులు అర్పించి వేణుమాధవ్ కుటుంబ సభ్యులను పరమార్శించారు.