టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌లో ప్రమాదం

* కాన్వాయ్‌లో ఒకదానికొకటి ఢీకొన్న 6 కార్లు

Update: 2023-03-04 07:30 GMT

టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌లో ప్రమాదం

Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్‌‌రెడ్డి ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళుతున్న కాన్వాయ్‌లో 6 కార్లు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. అయితే కార్లలోని ఎయిర్ బ్యాగ్‌లు ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ వద్ద చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన కార్లలో రెండు కార్లలో మీడియా ప్రతినిధులు ఉన్నారు. ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


Full View


Tags:    

Similar News