స్కూళ్లో జరిగిన విషయాలను ఇంట్లో చెప్పిన విద్యార్థిని.. ప్రిన్సిపల్ చితక్కొట్టిన ఘటన.. హైదరాబాద్ వనస్థలీపురం లోని ఎన్ఆర్ఐ స్కూళ్లో జరిగింది. బాలల దినోత్సవం రోజున విద్యార్థులను విహారయాత్రకు తీసుకెళ్లారు. అయితే ఆ యాత్ర వెళ్లిన నాలుగో తరగతి చదువుతున్న సాత్విక్.. టిఫిన్ బాక్స్ను తోటి విద్యార్థులు తిన్నారు. ఈ విషయాన్ని సాత్విక్.. తన నానమ్మకు చెప్పడంతో.. ఆమె స్కూల్కు వచ్చి.. యాజమాన్యాన్ని నిలదీసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రిన్సిపల్ కృష్ణకుమారి విచక్షణా రహితంగా కొట్టారు. దీంతో సాత్విక్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆగకుండా వాంతులు కావడంతో.. అక్కడి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
keywords: principal, student, Vanasthalipuram