Bharat Jodo Yatra: హుషారుగా సాగుతున్న రాహుల్ పాదయాత్ర

Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ఉత్సాహంగా నడుస్తున్న రాహుల్ గాంధీ

Update: 2022-11-02 01:19 GMT

Bharat Jodo Yatra: హుషారుగా సాగుతున్న రాహుల్ పాదయాత్ర

Bharat Jodo Yatra: తెలంగాణలో హుషారుగా సాగుతున్న రాహుల్ గాంధీ జోడో యాత్ర ఎనిమిదో రోజుకు చేరుకుంది. బోయిన్ పల్లిలో బసచేసిన రాహుల్ గాంధీ పాదయాత్రను ప్రారంభించి బాలానగర్, హబీబ్ నగర్, మూసాపేట, ఐడీఎల్ జంక్షన్, కూకట్ పల్లి, హఫీజ్ పేటమీదుగా సాగుతారు. ఉదయం పది గంటలకు హోటల్ కిన్నెర గ్రాండ్ వద్ద అల్పాహారం తీసుకుని మియాపూర్, రామచంద్రాపురం, పఠాన్ చెరువు మీదుగా సాగుతారు. పఠాన్ చెరువు నుంచి ఔటర్ రింగ్ రోడ్డు దాటిన తర్వాత ముత్తంగి పరిసరాల్లో సభ నిర్వహిస్తారు. రుద్రారం వినాయక ఆలయంలో బసచేస్తారు. రేపు యాత్రను ప్రారంభించి సంగారెడ్డి చేరుకుంటారు.

Tags:    

Similar News