రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం

Update: 2020-12-02 04:58 GMT

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. చేవెళ్ల మండలం మల్కాపూర్ గేట్ సమీపంలో ఇన్నోవా కారును బోర్‌వెల్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ఇద్దరు గాయాలతో బయటపడగా వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి హుటాహుటిన చేరుకున్న పోలీసులు మృతులు హైదరాబాద్‌లోని తాడ్‌బండ్‌కు చెందినవారిగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News