రథం తరలిస్తుండగా.. విద్యుత్‌ వైర్లు తగిలి ముగ్గురి మృతి

Nalgonda: నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతేపల్లి రామాలయం వద్ద విషాదం నెలకొంది.

Update: 2022-05-28 10:25 GMT

రథం తరలిస్తుండగా.. విద్యుత్‌ వైర్లు తగిలి ముగ్గురి మృతి

Nalgonda: నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతేపల్లి రామాలయం వద్ద విషాదం నెలకొంది. రథాన్ని రథశాలలో భద్రపరుస్తుండగా అపశృతి చోటుచేసుకుంది. రథానికి విద్యుత్ వైర్లు తగలడంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను గ్రామస్తులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. గ్రామానికి చెందిన రాజాబోయిన యాదయ్య, పొగాకు మొనయ్, మక్కపల్లికి చెందిన కారు డ్రైవర్ దాసరి అంజి చనిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

Tags:    

Similar News