వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టును ప్రకటించిన సెలక్షన్‌ కమిటీ

Update: 2019-04-15 09:58 GMT

ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదిగా మే 30 నుంచి జరిగే వన్డే ప్రపంచకప్ లో పాల్గొనే 15 మంది సభ్యుల భారతజట్టును బీసీసీఐ ఎంపిక సంఘం ఖరారు చేసింది. ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని భారత సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ముంబయిలో సమావేశమైంది. ఈ సమావేశానికి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ హాజరయ్యాడు. ప్రపంచకప్‌లో ఆడే 15 మందితో కూడిన టీమిండియా జట్టను మీడియాకు ప్రకటించారు.

విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌). ధోనీ, రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, కేదార్‌ జాదవ్‌, విజయ్‌ శంకర్‌, కేఎల్‌ రాహుల్‌, దినేశ్‌ కార్తీక్‌, చాహల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, కుల్దీప్‌యాదవ్‌, బుమ్రా, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమీ..



Similar News