ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ ఫైనల్స్‌లో తెలుగుతేజం పీవీ సింధు

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో తెలుగుతేజం పీవీ సింధు అలవోకగా ముందుకు సాగుతోంది.

Update: 2019-08-24 17:56 GMT

ప్రపంచ  బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో తెలుగుతేజం పీవీ సింధు అలవోకగా ముందుకు సాగుతోంది. టోర్నీ మొదటి నుంచి అద్భుతమైన ఆటతీరు కనబరుస్తున్న సింధు అదే ఊపుతో ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇవాళ జరిగిన సెమీఫైనల్లో సింధు వరుస గేముల్లో చైనాకు చెందిన చెన్ యు ఫీని మట్టికరిపించింది. సింధు 21-7, 21-14తో ప్రత్యర్థిని చిత్తు చేసి టైటిల్ పోరుకు సిద్ధమైంది. 

పసిడిపతకాన్ని సాధించాలన్న తన చిరకాల కోరిక ను నెరవేర్చుకోవడానికి ఒక్క మెట్టు దూరంలో వుంది.

Tags:    

Similar News