మధ్యప్రదేశ్ లోని ఇండోర్ వేధికగా బంగ్లాతో ఈనెల 14న నుంచి టీమిండియా తొలి టెస్టు ఆడనుంది. టీ20 సిరీస్ కు విశ్రాంతి తీసుకున్న భారత్ కెప్టెన్ కోహ్లీ రెండు టెస్టుల సిరీస్కు అందుబాటులో ఉండనున్నాడు. ఈ నేపథ్యంలో మైదానంలో క్రికెట్ ప్రాక్టీస్లో ఉండాల్సిన కోహ్లీ, సరదాగా కొంత మంది పిల్లలతో క్రికెట్ ఆడాడు. గల్లీ క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేశారు. ఫోర్లు సిక్సులు కొట్టి అలరించాడు. కోహ్లీ గల్లీ క్రికెట్ ఆడుతూ కనిపించిన ఓ వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తుంది.
బంగ్లాదేశ్తో జరిగిన టీ20 సిరీస్లో 2-1తో భారత్ ఘన విజయం సాధించింది. ఈ సిరీస్ కో తాత్కాలిక కెప్టెన్గా రోహిత్ శర్మ నాయకత్వం వహించాడు. దక్షిణాఫ్రీకాతో సిరీస్ ముగిసిన తర్వాత కోహ్లీ విశ్రాంతి తీసుకున్నాడు. తన భార్య బాలీవుడ్ నటీ అనష్కశర్మతో కలిసి భూటన్ హాలీడే ట్రిప్కు వెళ్లాడు. తీరక సమయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి గడిపాడు. మళ్లీ రెండు రోజుల్లో జరగనున్న టెస్టు సిరీస్కు కెప్టెన్గా కోహ్లీ తన బాధ్యతలు నిర్వహించనున్నాడు. భారత్ బంగ్లాదేశ్ రెండు టెస్టుల సిరీస్ మొదటి మ్యాచ్ ఇండోర్లో జరగనుంది. రెండో టెస్టు ఈ నెల 22న కోల్కతా ఈడెన్ గార్డెన్స్ లో జరగనుంది. రెండో టెస్టు భారత్ బంగ్లా మధ్య తొలి డే నైట్ టెస్టు మ్యాచ్.