Rishabh Pant: రిషబ్ పంత్ @17.. కివీస్ తో జరిగిన మ్యాచ్ లో అరుదైన సంఘటన

* నవంబర్ 17న లక్కీ నెంబర్ 17 జెర్సీతో 17 బంతుల్లో 17 పరుగులు చేసిన రిషబ్ పంత్

Update: 2021-11-18 10:52 GMT

Rishabh Pant: రిషబ్ పంత్ @17.. కివీస్ తో జరిగిన మ్యాచ్ లో అరుదైన సంఘటన

Rishabh Pant: బుధవారం న్యూజిలాండ్ తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో భారత జట్టు వికెట్ కీపర్ రిషబ్ పంత్ విషయంలో ఒక అరుదైన సంఘటన చోటు చేసుకుంది. చివర్లో ఫోర్ కొట్టి మ్యాచ్ టీమిండియాకు విజయాన్ని అందించిన రిషబ్ పంత్ తన లక్కీ నెంబర్ 17 తో మ్యాచ్ ని ముగించాడు.

అయితే ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే నవంబర్ 17న జైపూర్ లో జరిగిన మ్యాచ్ తన జెర్సీ నెంబర్ 17 తో గ్రౌండ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్ 17 బంతుల్లో 17 పరుగులు చేసి మొత్తానికి మ్యాచ్ తన లక్కీ నెంబర్ రోజున జెర్సీ, పరుగులు, బంతులను లక్కీ నెంబర్ తో గుర్తు చేశాడు. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా.. న్యూజిలాండ్ జట్టుపై అయిదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 

Tags:    

Similar News