T20 World Cup 2026: టీమిండియాకు 'వరల్డ్ కప్' షాక్: అమెరికాతో మ్యాచ్కు బుమ్రా దూరం.. టోర్నీ నుంచి హర్షిత్ రాణా అవుట్!
T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా శనివారం రాత్రి అమెరికా (USA) తో జరగనున్న కీలక పోరుకు ముందు భారత జట్టుకు వరుస ఎదురుదెబ్బలు తగిలాయి.
T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా శనివారం రాత్రి అమెరికా (USA) తో జరగనున్న కీలక పోరుకు ముందు భారత జట్టుకు వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అనారోగ్యం బారిన పడగా, మరో యువ పేసర్ హర్షిత్ రాణా గాయం కారణంగా టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు.
టీమిండియా ప్రధాన అస్త్రం జస్ప్రీత్ బుమ్రా వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్లు సమాచారం. శుక్రవారం వాంఖడే స్టేడియంలో జరిగిన ఆప్షనల్ ట్రైనింగ్ సెషన్కు కూడా అతడు హాజరుకాలేదు. దీంతో అమెరికాతో జరిగే మ్యాచ్లో బుమ్రాకు విశ్రాంతినివ్వాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. ప్రస్తుతం జట్టులో కేవలం 13 మంది ఆటగాళ్లు మాత్రమే పూర్తి ఫిట్నెస్తో అందుబాటులో ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్లో మోకాలి గాయానికి గురైన హర్షిత్ రాణా, ప్రపంచకప్ నుంచి అధికారికంగా తప్పుకున్నాడు. "వైద్య నివేదికల ప్రకారం రాణాకు ఫిట్నెట్ లేదని తేలింది, అందుకే అతడు టోర్నీ నుంచి తప్పుకుంటున్నాడు" అని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. రాణా స్థానంలో సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఇప్పటికే జట్టులోకి వచ్చాడు. బుమ్రా అందుబాటులో లేకపోవడంతో సిరాజ్ తుది జట్టులో చేరడం దాదాపు ఖాయమైంది.
వాషింగ్టన్ సుందర్ కోసం నిరీక్షణ మరోవైపు ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఇంకా జట్టుతో చేరలేదు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA - సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్) లో అతను ఫిట్నెస్ క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. కీలకమైన టోర్నీ మధ్యలో ఆటగాళ్ల గాయాలు మరియు అనారోగ్యం కెప్టెన్ రోహిత్ శర్మకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి.
శనివారం రాత్రి అమెరికాతో జరిగే మ్యాచ్లో ఈ మార్పులతో టీమిండియా ఎలా రాణిస్తుందో చూడాలి.