T20 World Cup 2021: నేడు ఆఫ్గానిస్థాన్‌తో భారత్‌ ఢీ

T20 World Cup 2021: టీ-20 ప్రపంచకప్‌లో ఇవాళ అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది టీమిండియా.

Update: 2021-11-03 03:54 GMT

T20 World Cup 2021: నేడు ఆఫ్గానిస్థాన్‌తో భారత్‌ ఢీ

T20 World Cup 2021: టీ-20 ప్రపంచకప్‌లో ఇవాళ అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది టీమిండియా. పేలవ ప్రదర్శనతో తొలి రెండు మ్యాచుల్లో పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ చేతుల్లో పరాజయంపాలైన భారత్‌కు కాస్త సెమీస్‌ ఆశలైనా నిలవాలంటే ఆఫ్గాన్‌పై భారీ విజయం అవసరం. అంతేకాదు న్యూజిలాండ్‌ను ఆఫ్గాన్‌ ఓడించాలి. మొత్తానికి కెప్టెన్‌ కోహ్లీకిది పరీక్ష కాలమే అని చెప్పొచ్చు. కాగా ఇప్పటికే ఆఫ్గానిస్థాన్‌ స్కాట్లాండ్‌, నమీబియాతో విజయం సాధించింది.

తుది జట్లు (అంచనా)

భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్, రాహుల్, ఇషాన్‌/సూర్యకుమార్,పంత్, హార్దిక్, జడేజా, శార్దుల్, షమీ, బుమ్రా, వరుణ్‌.

అఫ్గానిస్తాన్‌: నబీ (కెప్టెన్‌), హజ్రతుల్లా, షహజాద్, రహ్మానుల్లా, హష్మతుల్లా/ఉస్మాన్, నజీబుల్లా, గుల్బదిన్, రషీద్, ముజీబ్, నవీన్, హసన్‌.

Tags:    

Similar News