WTC Final 2023: శుబ్‌మన్‌ గిల్‌కు బిగ్‌ షాకిచ్చిన ఐసీసీ.. ఏకంగా 115 శాతం ఫైన్!

WTC Final 2023: టీమ్ ఇండియా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్‌ గిల్‌కు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ బిగ్‌ షాక్‌ ఇచ్చింది.

Update: 2023-06-12 09:55 GMT

WTC Final 2023: శుబ్‌మన్‌ గిల్‌కు బిగ్‌ షాకిచ్చిన ఐసీసీ.. ఏకంగా 115 శాతం ఫైన్!

WTC Final 2023: టీమ్ ఇండియా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్‌ గిల్‌కు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ బిగ్‌ షాక్‌ ఇచ్చింది. తాజాగా ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్‌ 2023లో థర్డ్ అంపైర్ నిర్ణ‌యంపై అస‌హ‌నం వ్య‌క్తం చేసిన గిల్‌పై ఐసీసీ చర్యలు తీసుకుంది. అతడి మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించింది. స్లో ఓవ‌ర్ రేట్ కారణంగా భారత జట్టుకు ఐసీసీ మ్యాచ్ ఫీజులో 100 శాతం జ‌రిమానా విధించింది. దాంతో మొత్తంగా గిల్‌పై 115 శాతం ఫైన్ పడింది. ఐసీసీ నిబంధనల్లోని 2.7 నియమాన్ని గిల్‌ ఉల్లంఘించినందకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ ఓ ప్రకటనలో పేర్కొంది.

Tags:    

Similar News