India vs Australia, 2nd ODI : సెంచరీ మిస్ అయిన శిఖర్ ధావన్

రాజ్ కోట్ వన్డే లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ 96 (90) తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. 96 పరుగుల వద్ద ధావన్ అవుట్ అయ్యాడు.

Update: 2020-01-17 10:10 GMT

రాజ్ కోట్ వన్డే లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ 96 (90) తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. 96 పరుగుల వద్ద ధావన్ అవుట్ అయ్యాడు. హాఫ్ సెంచరీ చేసిన తర్వాత ఆసీస్ బౌలర్లపై విరుచుకపడ్డ ధావన్ సెంచరీకి చేరువయ్యాడు. ఈ క్రమంలో జై రిచర్డ్‌సన్‌ బౌలింగ్ లో స్టార్క్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు . ప్రస్తుతం భారత జట్టు 29 ఓవర్ లకి గాను రెండు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్ లో శ్రేయాస్ అయ్యర్ 0 (4) కోహ్లి 23 (25) పరుగులతో ఉన్నారు. అంతకుముందు జాంపా వేసిన 14వ ఓవర్లోని రెండో బంతికి రోహిత్ శర్మ42 (44) ఎల్బీడబ్యూ రూపంలో ఔట్ అయ్యాడు. 

Tags:    

Similar News