ఐ మిస్ యు.. వింబుల్డన్‌కు భావోద్వేగంతో వీడ్కోలు పలికిన సానియా

Sania Mirza: భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా కేరీర్‌లో ఓ కీలక అంకానికి తెరపడింది.

Update: 2022-07-07 14:00 GMT

ఐ మిస్ యు.. వింబుల్డన్‌కు భావోద్వేగంతో వీడ్కోలు పలికిన సానియా

Sania Mirza: భారత టెన్నిస్ దిగ్గజం సానియామీర్జా కేరీర్‌లో ఓ కీలక అంకానికి తెరపడింది. ప్రతిష్టాత్మక వింబుల్డన్‌కు సానియా వీడ్కోలు చెప్పింది. మిక్స్‌డ్ డబుల్స్ సెమీస్‌లో ఓడిపోయాక ఆమె భావోద్వేగంతో ట్వీట్ చేసింది. మానసికంగా, శారీరకంగా, భావోద్వేగాల పరంగా క్రీడలు కీలకపాత్ర వహిస్తాయని పేర్కొంది. గెలుపోటములు, గంటల కొద్దీ హార్డ్ వర్క్స్, ఎంతో పోరాడి ఓడిన తర్వాత నిద్రలేని రాత్రులు గడవల్సి వస్తుంది. కానీ ఇవన్నీతిరిగి ఎంతో ఇస్తాయని సానియా అభిప్రాయపడింది.

కన్నీళ్లు, సంతోషం, పోరాటం, సంఘర్షణ.. ఇవన్నీ చివరకు మన కష్టానికి దక్కే ఫలితాలేనన్నది. వింబుల్డన్ ఒక అద్భుతమంటూ సానియా వ్యాఖ్యానించింది. గత 20 ఏళ్లుగా ఇక్కడ ఆడటం ఒక గౌరవం.. ఐ మిస్ యూ అంటూ సానియా భావోద్వేగం వ్యక్తం చేసింది. WTA సర్క్యూట్ నుంచి తప్పుకుంటానని గతంలో ప్రకటించినట్టుగానే ఆమె గుడ్ బై చెప్పింది. 


Tags:    

Similar News