'టై' గా ముగిసిన మ్యాచ్.. సిరీస్ టీమిండియాదే..
NZ vs IND: నేపియర్లో టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్ టైగా ముగిసింది.
NZ vs IND: నేపియర్లో టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్ టైగా ముగిసింది. వర్షం కారణంగా మ్యాచ్ మధ్యలోనే నిలిచిపోవడంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతి వర్తింపజేశారు. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి టీమిండియా 9 ఓవర్లలో 4 వికెట్లకు 75 పరుగులు చేసింది. ఎంతకీ వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ కొనసాగించే వీల్లేకపోవడంతో డక్ వర్త్ లూయిస్ విధానం ప్రకారం ఇరుజట్ల స్కోర్లు సమం అయ్యాయి. దాంతో మ్యాచ్ టై అయినట్టు రిఫరీ ప్రకటించారు.
దీంతో 1-0తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా సిరీస్ను కైవసం చేసుకుంది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిల్యాండ్ జట్టు 19.4 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌట్ అయింది. కాన్వే 59, ఫిలిప్స్ 54 పరుగులు చేశారు. సిరాజ్, అర్షదీప్ చెరో 4 వికెట్లు తీసి సత్తా చాటారు. అనంతరం 161 లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా 9 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది.