IPL 2021: టాస్ గెలిచిన ఢిల్లీ కేపిటల్స్..తుది జట్లు ఇవే

IPL 2021:ఎడిషన్ 14 రెండో మ్యాచ్ హేంద్రసింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్, రిషబ్ పంత్ నేతృత్వం వహిస్తోన్న ఢిల్లీ కేపిటల్స్ జట్లు తలపడనున్నాయి.

Update: 2021-04-10 13:46 GMT

IPL 2021: ఐపీఎల్ సీజన్ 2021 ఎడిషన్ 14 రెండో మ్యాచ్ హేంద్రసింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్, రిషబ్ పంత్ నేతృత్వం వహిస్తోన్న ఢిల్లీ కేపిటల్స్ జట్లు తలపడనున్నాయి. వాంఖడే వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో రెండు జట్లు తాడో పెడో తేల్చుకోనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ కేపిటల్స్ జట్టు ఫిల్డింగ్ ఎంచుకుంది. గత ఏడాది యూఏఈ వేదికగా జరిగిన టోర్నీలో ధోని టీం అవమానకరంగా టోర్నమెంట్‌ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఢిల్లీ కేపిటల్స్ ఫైనల్లో ముంబైపై ఓడి రన్నరప్ గా నిలిచింది. ఈ సారి రెండు జట్లు టైటిల్ సాదించాలనే పట్టుదలతో ఉన్నాయి.

ఢిల్లీ కేపిటల్స్ జట్టు:

రిషబ్ పంత్ కెప్టెన్, పృథ్వీ షా, శిఖర్ ధావన్, స్టీవ్ స్మిత్,  అజింక్య రహానే, లలిత్ యాదవ్, మార్కస్ స్టోయినిస్, క్రిస్ వోక్స్, హెట్మైర్, అశ్విన్, అమిత్ మిశ్రా, టామ్ కుర్రమ్.

చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌లో:

ఎంఎస్ ధోనీ కెప్టెన్, గైక్వాడ్, ఫాఫ్ డు ఫ్లెసిస్, సురేష్ రైనా, అంబటి రాయుడు, మొయిన్ అలీ, సామ్ కుర్రమ్, డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాగూర్, దీపక్ చాహార్

Tags:    

Similar News