IPL 2021: ధోనీ వర్సెస్ పంత్.. తెలుగు కుర్రాడికి ఛాన్స్?

IPL 2021
x

ధోని vs పంత్ 

Highlights

IPL 2021:ఐపీఎల్ 2021 సీజన్ లో రెండు మ్యాచ్ శనివారం సాయంత్రం ఆరంభం కానుంది.

IPL 2021: ఐపీఎల్ 2021 సీజన్ లో రెండు మ్యాచ్ శనివారం సాయంత్రం ఆరంభం కానుంది. రెండో మ్యాచ్‌లో హేంద్రసింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్, రిషబ్ పంత్ నేతృత్వం వహిస్తోన్న ఢిల్లీ కేపిటల్స్ తలపడనున్నాయి. గతానికి భిన్నంగా శనివారం రెండు మ్యాచులు కాకుండా.. ఒకే మ్యాచ్‌తో సరిపెట్టారు. గత ఏడాది మ్యాచ్ ధోని నాయకత్వంలోని చెన్నై దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే.

‎చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స జరిగిన మ్యాచ్ లో రెండోసారి బ్యాటింగ్ దిగిన జట్టు విజయం సాధించిన విషయంత తెలిసిందే. గత ఏడాది యూఏఈలో జరిగిన టోర్నమెంట్‌లో ఢిల్లీ కేపిటల్స్ ఫైనల్ కు చేరింది. ఈ సారి ఆ జట్టు ఫ్రాంచైజీ కీలక మార్పులు చేసింది. ఏకంగా కెప్టెన్ స్థానం మార్పు చేసింది. యువ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ స్థానంలో రిషబ్ పంత్‌కు జట్టు పగ్గాలను అప్పగించింది.

చెన్నై సూపర్ కింగ్స్‌ కథ మరోలా ఉంది. అత్యంత అవమానకరంగా టోర్నమెంట్‌ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. కనీసం ప్లే ఆఫ్‌కు కూడా చేరలేకపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చోటును దక్కించుకున్న కడప జిల్లా రాయచోటి క్రికెటర్ ఎం హరిశంకర్ రెడ్డి ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉంది.

తుది జట్ల అంచనా:

చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌లో: ఎంఎస్ ధోనీ( కెప్టెన్ ), ఫాఫ్ డు ఫ్లెసిస్, రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు, సురేష్ రైనా, మొయిన్ అలీ, సామ్ కుర్రమ్, డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా, కృష్ణప్ప గౌతమ్, శార్దుల్ ఠాగూర్

ఢిల్లీ కేపిటల్స్ జట్టు: రిషబ్ పంత్ (కెప్టెన్), పృథ్వీ షా, శిఖర్ ధావన్, స్టీవ్ స్మిత్, లలిత్ యాదవ్, మార్కస్ స్టోయినిస్, క్రిస్ వోక్స్, అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ, టామ్ కుర్రమ్.

Show Full Article
Print Article
Next Story
More Stories