శ్రీలంక జట్ట ఐదో వికెట్ కోల్పోయింది. కీలక బ్యాట్స్మెన్ మ్యాథుస్ను అవుట్ భారత బౌలర్ వాషింగ్టన్ సుందర్ ఔట్ చేశాడు. అయితే మ్యాథ్యుస్ (31) డిసిల్వా ఇద్దరు కలిసి శ్రీలంక ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఇద్దరూ కలిసి ఐదో వికెట్ కు 72పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ప్రమాదకరంగా మారుతున్న వీరి జోడిని సుందర్ వీడతీశాడు. దీంతో 13 ఓవర్లు ముగిసేసరికి ఐదు వికెట్ల నష్టానికి శ్రీలంక 113 పరుగులు చేసింది. డిసిల్వా 46 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మరో వైపు షనక 9 పరుగులతో ఉన్నాడు. శ్రీలంక విజయం సాధించాలంటే 40 బంతుల్లో 92 పరుగులు అవసరం.