పుణే వేదికగా భారత్ శ్రీలంక మధ్య నిర్ణయాత్మక మూడో టీ20లో మరి జరుగనుంది. మొదట టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా ఓపెనర్లు ధాటిగా ఆడుతున్నారు. 9 ఓవర్లు ముగిసేసరికి భారత్ 82 పరుగులు చేసింది. ఓపెనర్ ధావన్ 47, రాహుల్ 36 పరుగులతో క్రీజులో ఉన్నారు.
మరోవైపు టీమిండియా జట్టులో మూడు మార్పులు చేసింది. మైదానంలో సత్తా చాటేందుకు ఎదురుచూస్తున్న మనీశ్ పాండే, సంజు శాంసన్లకు ఎట్టకేలకు చోటుకల్పించింది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో చాహల్ను తీసుకుంది. ఇక శ్రీలంక జట్టులో రెండు మార్పులు చేశారు. సినీయర్ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్, లక్షణ్ సందాకన్ ఎంపిక చేశారు. ఉడానా గాయం కారణంగా దూరమైయ్యాడు.