రేపటి నుంచే సఫారీలతో భారత్ వన్డే వార్.. విరాట్ కోహ్లీపైనే అందరి చూపులు..

India vs South Africa: సఫారీలతో టెస్టు సిరీస్ ఓటమి తర్వాత మరో ఆసక్తికర పోరుకు టీమిండియా సిద్ధమైంది.

Update: 2022-01-18 14:09 GMT

రేపటి నుంచే సఫారీలతో భారత్ వన్డే వార్.. విరాట్ కోహ్లీపైనే అందరి చూపులు..

India vs South Africa: సఫారీలతో టెస్టు సిరీస్ ఓటమి తర్వాత మరో ఆసక్తికర పోరుకు టీమిండియా సిద్ధమైంది. సౌతాఫ్రికాతో రేపటి నుంచి వన్డే వార్ షురూ కానుంది. మధ్యాహ్నం రెండు గంటలకు పార్ల్ వేదికగా ప్రారంభమయ్యే మ్యాచ్ కోసం ఇప్పటికే ఆటగాళ్లు ఫుల్ ప్రాక్టీస్ చేశారు. ఇదే సమయంలో కెప్టెన్ గా అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్న తర్వాత విరాట్ కొహ్లీ గతంలోలా విరుచుకుపడతాడనే ఫ్యాన్స్ బలంగా విశ్వసిస్తున్నారు. రోహిత్ శర్మ గైర్హాజరీలో కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన రాహుల్ భావి భారత కెప్టెన్ గా తన అవకాశాలను మరింత మెరుగుపరుచుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు. రేపటి మ్యాచ్ ద్వారా టెస్టు సిరీస్ ఓటమికి బదులివ్వాలని టీమిండియా భావిస్తోంది.

Tags:    

Similar News